EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

1 hour ago

EPFO Wage Ceiling Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.

EPFO Wage Ceiling Hike: విశ్వకర్మ జయంతి సందర్భంగా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ (EPF) వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దిల్లీలో బుధవారం మాట్లాడుతూ .. "ప్రస్తుత పీఎఫ్ నిబంధనల ప్రకారం, వేతన పరిమితి రూ.15,000గా ఉంది. ఈ పరిమితిని సెప్టెంబర్ 2014లో సవరించారు. ఇప్పుడు, మేము దానిని నెలకు రూ.25,000కు పెంచాం" అని తెలిపారు.

51 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి  

కేంద్ర మంత్రి మాట్లాడుతూ, "పీఎఫ్ మినహాయింపులకు కొత్త వేతన పరిమితి నెలకు రూ.25,000గా ఉంటుంది. దీంతో రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య జీతం ఉన్న సుమారు 51 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు. వీరంతా ఇప్పుడు కొత్త పీఎఫ్ నిబంధనల పరిధిలోకి వస్తారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.11,339 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కార్మికుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రధాని మోదీ సెప్టెంబర్ 16న  దీనిని ఆమోదించారు. ఈ ప్రతిపాదనపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చ జరిగింది, అలాగే ఆర్థిక కమిటీ సమావేశంలో దీనిని సిఫార్సు చేసింది. ఐదేళ్లలో దీని అంచనా వ్యయం సుమారు రూ.56,696 కోట్లు" అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

మూడు ప్రధాన ప్రయోజనాలు

వేతన పరిమితి పెంపుతో లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా విధానం అందుబాటులోకి వస్తుంది. వేతన పరిమితి పెంపుతో, ఉద్యోగులు మూడు ప్రధాన ప్రయోజనాలను పొందుతారు. మొదటిది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద రెగ్యులర్ సేవింగ్స్ ద్వారా ప్రయోజనం పొందుతారు. రెండోది, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. మూడో, ఎంప్లాయీస్ డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద బీమా సౌకర్యం కూడా అందుబాటులో వస్తుంది.  

ఉపాధి కేవలం వేతనాలకే మాత్రమే పరిమితం కాకూడదని, హామీతో కూడిన సామాజిక భద్రత కూడా తోడవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ కొత్త వ్యవస్థ ఈపీఎఫ్‌ను మరింత బలపరుస్తుందన్నారు. ఈ నిర్ణయం ఉద్యోగులకే కాకుండా యజమానులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సామాజిక భద్రతా కవరేజీ ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుందన్నారు.  

కంపెనీలు, ఉద్యోగుల మధ్య విశ్వాసం  

ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుతో కంపెనీలు, ఉద్యోగుల మధ్య బంధం బలపడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుత బడ్జెట్ వ్యయం రూ.10,250 కోట్లతో పోలిస్తే, వార్షిక వ్యయం సుమారు రూ.11,339 కోట్లకు పెరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం, ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ సెక్యూరిటీ వ్యవస్థలలో ఈపీఎఫ్‌ఓ ఒకటి. తాజా సమాచారం ప్రకారం, సుమారు 79.8 మిలియన్ల మంది చందదారులు, 7,68,000కు పైగా సంస్థలు ఈపీఎఫ్‌ఓతో అనుబంధం కలిగి ఉన్నాయి. ఉద్యోగుల పింఛను పథకం ద్వారా సుమారు 8.2 మిలియన్ల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతున్నారు.

Click here to Read More
Previous Article
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Next Article
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!

Related జాబ్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment