IPL Auction In India.!: మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు

1 hour ago

గల్ఫ్ దేశాల్లో వేలం తర్వాత ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని బోర్డు భావిస్తుండగా, వివాదాస్పద ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ర‌ద్దుపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

BCCI Planning Domestic Venue For IPL 2027 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్ కోసం నిర్వహించే ఆటగాళ్ల వేలాన్ని స్వదేశంలోనే నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. గత మూడేళ్లుగా విదేశాల్లో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌ను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. గత మూడు సీజన్ల వేలాలు దుబాయ్, జెడ్డా (మెగా వేలం), అబుదాబి వేదికలుగా సాగాయి. "ప్రతీ ఏడాది భారత్‌లోనే వేలం జరపాలని మేము ప్రయత్నిస్తున్నాం, కానీ ఆ సమయంలో పెళ్లిళ్ల సీజన్ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సరైన వేదికలు దొరకడం కష్టమవుతోంది. ఈసారి జరగబోయేది చిన్న మినీ వేలం మాత్రమే కాబట్టి, ఖచ్చితంగా స్వదేశంలోనే నిర్వహించాలని చూస్తున్నాం. బీసీసీఐ కోరుకున్న వేదిక లభ్యత ఆధారంగా ఆతిథ్య నగరాన్ని త్వరలోనే ఖరారు చేస్తాం" అని ధుమాల్ తెలిపాడు. సెప్టెంబర్ 18న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అతడు ఐపీఎల్ చైర్మన్‌గా తిరిగి ఎన్నిక కానున్నాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై సస్పెన్స్.. 
ఇటీవల జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో అత్యంత వివాదాస్పదమైన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై తీవ్ర స్థాయి చర్చ జరిగింది. 2027 వరకు అమల్లో ఉండాల్సిన ఈ రూల్‌పై అన్ని ఫ్రాంచైజీల నుంచి బోర్డు తాజా ఫీడ్‌బ్యాక్‌ను కోరింది. టీమ్ ఇండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మాజీ సారథి రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు ఇప్పటికే ఈ విధానాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. ఈ నిబంధన వల్ల జట్లలో ఆల్‌రౌండర్ల పాత్ర పూర్తిగా బలహీనపడుతుందని, వారి ప్రాధాన్యత తగ్గిపోతుందని చాలామంది ఆటగాళ్లు వాదిస్తున్నారు.

కెప్టెన్ల రిజర్వేషన్లు.. సమీక్షకు సిద్ధమైన పాలకమండలి
గత ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే ఎక్కువ మంది కెప్టెన్లు తమ అభ్యంతరాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. మ్యాచ్ జరుగుతున్న సమయం లో ఏ దశలోనైనా ఒక ప్లేయర్‌ను బరిలోకి దించేందుకు వీలు కల్పించే ఈ వ్యూహాత్మక నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్లు పెరిగాయి. దీనిపై స్పందించిన అరుణ్ ధుమాల్, ఈ వ్యవహారం ఇంకా చర్చల దశలోనే ఉందని, ఫ్రాంచైజీ లు, ఆటగాళ్లు, బ్రాడ్‌కాస్టర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు.

గవర్నింగ్ కౌన్సిల్ రీఎలక్షన్.. కొత్త సీజన్‌కు అడుగులు
ఈ వారం జరిగే వార్షిక సమావేశంలో అరుణ్ ధుమాల్‌తో పాటు ఖైరుల్ మజుందార్ కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు తిరిగి ఎన్నిక కానున్నారు. కొత్త సీజన్ కోసం వేదిక ఎంపిక, నిబంధనల మార్పులపై బోర్డు కీలక కసరత్తు ప్రారంభించింది.

Click here to Read More
Previous Article
Erravalli Farmhouse Probe: రేవంత్ రెడ్డి భూముల అస్త్రం - బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి - ఫామ్ హౌస్‌ లెక్కలన్నీ బయటకు వస్తాయా?
Next Article
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?

Related స్పోర్ట్స్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment