Filters

Channels
Topics
Other Filters

YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?

Vizianagaram YSRCP: విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడిపై వేటు, చిన్న శ్రీను రాజీనామా తర్వాత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. YS Jagan Vs Botsa Satyanarayana North Andhra: ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ చక్రవర్తి గా వెలుగొందిన బొత్స సత్యనారాయణ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధినాయకత్వం నుంచి అనూహ్యమైన షాక్‌లు తగులుతున్నాయి. జిల్లాపై బొత్స కుటుంబానికి ఉన్న ఏకఛత్రాధిపత్యానికి స్వస్తి పలుకుతూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా వేగంగా క్షేత్రస్థాయి మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల బొత్స మేనల్లుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు   వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరిపోయిన వెంటనే.. ఆ ప్రభావం బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడిపై పడింది. నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి బడ్డుకొండను తొలగించి, గదల సన్యాసినాయుడిని కొత్త సమన్వయకర్తగా నియమించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. మజ్జి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పల్నాయుడు వియ్యంకులు కూడా.  బొత్స రాజకీయంపై జగన్‌కు స్పష్టత ఉందా?  ఈ నిర్ణయం వెనుక వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  2024 ఎన్నికల ఓటమి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలువురు సీనియర్లు జంప్ అవుతున్న వేళ, బొత్స కుటుంబం కూడా రేపో మాపో వైఎస్సార్‌సీపీని వీడుతుందనే ప్రచారం బలపడింది. ముఖ్యంగా చిన్న శ్రీను టీడీపీలోకి వెళ్లడంతో, ఆ కుటుంబం ఇప్పటికే  గోడ మీద పిల్లి లా వ్యవహరిస్తోందని అధిష్ఠానం భావిస్తోంది. దాంతో, వాళ్లు పార్టీ వీడే వరకు వేచి చూసి నియోజకవర్గాల్లో పార్టీని ఖాళీ చేయడం కంటే,  వారే వెళ్లేలోపే తమ మార్క్ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేయాలి  అనే కఠిన నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగాచెబుతున్నారు.  బొత్స పట్టు తగ్గించే ప్లాన్  బొత్స కుటుంబం వైఎస్సార్‌సీపీలో కొనసాగినప్పటికీ, వారి  కనుసన్నల్లోనే జిల్లా రాజకీయాలు నడవాలనే పాత ఫార్ములాకు స్వస్తి పలకడమే జగన్ వ్యూహం. అందుకే విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవిని చిన్న శ్రీను నుంచి తప్పించి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు అప్పగించారు. మరోవైపు బొత్స బంధువు బడ్డుకొండను నెల్లిమర్ల నుంచి పక్కన పెట్టడం ద్వారా.. పార్టీలో ఏ ఒక్కరిపై ఆధారపడబోమనే స్పష్టమైన సంకేతాన్ని పంపారు. పార్టీ వేదికలపై బొత్స సత్యనారాయణ, బడ్డుకొండ అప్పలనాయుడు కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ, అధిష్ఠానం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొన్ని గంటల వ్యవధిలోనే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  జగన్ ప్రయత్నాలు ఫలిస్తాయా?    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. బొత్స కుటుంబ పట్టున్న స్థానాలను ఒక్కొక్కటిగా విడదీస్తూ, ద్వితీయ శ్రేణి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జగన్ జిల్లాలో సరికొత్త వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బొత్స వర్గాన్ని  డిఫెన్స్‌లో పడేసింది. తము పార్టీలో ఉంటూనే తమ ప్రత్యర్థులకు బాధ్యతలు అప్పగిస్తుంటే.. ఇక పార్టీలో కొనసాగాలా వద్దా అనే పునరాలోచనలో బొత్స సత్యనారాయణ పడేలా అధినాయకత్వపు చర్యలు ఉన్నాయి. వారు వెళ్లేలోపే సొంత సామ్రాజ్యాన్ని పునర్నిర్మించుకోవడం  అనే క్రాస్ స్ట్రాటజీని జగన్ అమలు చేస్తున్నారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ కుటుంబం వైఎస్సార్‌సీపీని వీడినా, జిల్లాలో పార్టీ పూర్తిగా పడిపోకుండా ముందస్తుగా కొత్త నాయకులను నిలబెట్టాలనే ఆలోచన స్పష్టమవుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి విజయనగరంలో బొత్స వర్గం లేకపోయినా నిలబడేలా వైఎస్సార్‌సీపీ వేస్తున్న ఈ పాచికలు ఉత్తరాంధ్ర రాజకీయ రణరంగాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.   

AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP Police Recruitment: ఏపీలో పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఏపీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చింది. AP Police Recruitment: ఏపీలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మంగళవారం 892 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. తాజాగా బుధవారం 2050 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) ద్వారా  ప్రకటన విడుదల చేసింది. పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం 438 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో సివిల్‌ విభాగంలో 253, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 116, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌‌లో 9, కమ్యూనికేషన్స్‌‌లో 50, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో 10 పోస్టులు ఉన్నాయి.  1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలు అలాగే 1,156 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, ఫైర్‌, జైళ్ల విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోలీస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో 200 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్లు, మెకానిక్‌ ఉద్యోగాలు ఉన్నాయి. పీటీవో విభాగంలో 15 మెకానిక్స్‌, 198 డ్రైవర్‌, 43 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి త్వరలో రాత పరీక్ష తేదీల వివరాలను ప్రకటించనున్నారు.  పోస్టుల వివరాలు ఇలా ఎస్ఐ (SPF) - 9 ఎస్ఐ (కమ్యూనికేషన్) - 50 ఎస్ఐ (PTO) - 10 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ - 43 పీసీ (సివిల్/ఏఆర్) - 827 ఫైర్‌మెన్‌- 158 వార్డర్ - 171 పీసీ (కమ్యూనికేషన్) - 200 పీసీ (మెకానిక్స్‌, డ్రైవర్లు) - 213 ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్ విధానం, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను APSLPRB ప్రకటించనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ విధానం, దరఖాస్తు తేదీలను పూర్తిగా పరిశీలించి అప్లై చేసుకోవచ్చు. 

Fauzi Release Update: జనవరి బరిలో ప్రభాస్ 'ఫౌజీ'? సంక్రాంతి సినిమాలకు టెన్షన్?

Fauzi Release On January: డిసెంబర్ మొదటి వారంలో ప్రభాస్ 'ఫౌజీ' విడుదల అయ్యే అవకాశాలు లేవని క్లారిటీ వచ్చింది. జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫిల్మ్ నగర్ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే? రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi Movie). ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసిన ఓ భారతీయ సైనికుడి కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదల తేదీపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే? డిసెంబర్ రేసు నుంచి వాయిదా!'ఫౌజీ' సినిమాను డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి తొలుత ప్లాన్ చేశారు. అయితే... ఫిల్మ్ నగర్ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే రిలీజ్ అయ్యే ఛాన్సు కనిపించడం లేదు. 'ఫౌజీ' విడుదల వాయిదా పడిందని సమాచారం అందడంతో డిసెంబర్ 4న తమ సినిమాలను విడుదల చేయడానికి నాగ చైతన్య (వృషకర్మ), విశ్వక్ సేన్ (లెగసీ) రెడీ అవుతున్నారు. మరి ప్రభాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటే కొత్త న్యూస్ వినబడుతోంది. అసలు ఫౌజీ ఎందుకు వాయిదా పడింది?'ఫౌజీ'లో విడుదల వాయిదా పడటానికి ప్రధాన కారణం సిజిఐ, గ్రాఫిక్స్ వర్క్స్ అని తెలుస్తోంది. ప్రభాస్ తన షూటింగ్ వర్క్ అంతా నవంబర్ నాటికి పూర్తి చేస్తారని ముందు అనుకున్నప్పటికీ... దర్శకుడు హను రాఘవపూడి అవుట్‌ పుట్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని, అందువల్ల సినిమా పూర్తి అవ్వడానికి మరికొంత సమయం అవసరం అవుతుందని, అందుకే సినిమా విడుదల వాయిదా వేశారని సమాచారం. జనవరి 26న విడుదల... సంక్రాంతి టెన్షన్?డిసెంబర్ నెలలో థియేటర్లలో 'ఫౌజీ' వచ్చే అవకాశం లేదు. దాంతో మరో విడుదల తేదీ కోసం దర్శక నిర్మాతలు చూస్తున్నారు. వచ్చే ఏడాది (2027) రిపబ్లిక్ డే (జనవరి 26న) సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తే బావుంటుందని భావిస్తున్నారట. ఒకవేళ అది నిజమైతే సంక్రాంతి సినిమాలకు టెన్ష తప్పదని చెప్పాలి. జనవరి 10 నుంచి 15 మధ్యలో నాలుగైదు సినిమాలు విడుదల కానున్నాయి. థియేటర్లలోకి ఎక్కువ సినిమాలు వస్తే కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. థియేట్రికల్ రన్ ఎక్కువ రోజులు ఉంటే బడ్జెట్ రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు వచ్చిన రెండు మూడు వారాలకు 'ఫౌజీ' లాంటి పెద్ద సినిమా వస్తే... సంక్రాంతి సినిమాలు చూసేందుకు థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య తక్కువ. అప్పుడు వాటికి టెన్షన్ తప్పదు. ఒకవేళ 'ఫౌజీ' విడుదల తేదీ మారితే... ఓటీటీ డీల్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా మారే అవకాశం ఉంది. మార్చి 2027లో విడుదల కావాల్సిన ప్రభాస్ 'స్పిరిట్' కూడా వాయిదా పడొచ్చు.

Suriya Jyothika: సూర్య, జ్యోతికకు మళ్ళీ పెళ్ళి... పిల్లల సాక్షిగా మళ్ళీ ప్రమాణం... వెడ్డింగ్ వీడియో వైరల్

Suriya Jyothika Wedding: సెప్టెంబర్ 11 2006న వివాహ బంధంతో సూర్య, జ్యోతిక ఒక్కటి అయ్యారు. పెళ్ళై 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా మళ్ళీ పెళ్ళి చేసుకుందీ జంట. ఆ వీడియో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి? పిల్లల కెరీర్, పెంపకంలో బాధ్యతలు ఎలా పంచుకోవాలి? వంటి విషయాల్లో భారతీయ చిత్ర పరిశ్రమలో ఇతర ప్రముఖులకు, ప్రేక్షకులకు ఆదర్శంగా నిలుస్తున్న జంటల్లో కోలీవుడ్ స్టార్ సూర్య శివ కుమార్, హీరోయిన్ జ్యోతిక జంట ఒకటి. సెప్టెంబర్ 11 2006న వివాహ బంధంతో వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. వివాహమై 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మళ్ళీ పెళ్ళి చేసుకుందీ జంట. పిల్లల సాక్షిగా పెళ్ళి... వీడియో వైరల్!ఆదర్శ దంపతులుగా పేరు పొందిన సూర్య, జ్యోతిక... భార్యాభర్తలుగా తమ 20 ఏళ్ళ వివాహ ప్రయాణాన్ని వేడుకలా జరుపుకొన్నారు. విదేశాల్లోని ఓ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో జ్యోతిక వైట్ కలర్ వెడ్డింగ్ గౌనులో మెరిశారు. సూర్య కూడా వైర్ కలర్ సూట్, బ్లాక్ ట్రౌజర్ ధరించి హ్యాండ్సమ్‌గా కనిపించారు.సూర్య, జ్యోతికల వివాహ వార్షికోత్సవ వేడుకకు వాళ్ళ పిల్లలు దియా, దేవ్... ఇంకా సూర్య సోదరుడు కార్తీతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రులు హాజరయ్యారు. ఈ సెలబ్రేషన్స్ వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ది సీక్వెల్... మా 20 ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని వేడుకగా జరుపుకొంటున్నాం'' అని క్యాప్షన్ ఇచ్చారు. నిస్వార్థమైన ప్రేమకు ప్రతిబింబంఈ వేడుక ఓ పరిపూర్ణమైన వివాహానికి సంకేతం కాదని... ఓ జంట అసమానతలు, సర్దుబాట్లు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమను ప్రతిబింబించే వేడుక అని జ్యోతిక పేర్కొన్నారు. అంతే కాకుండా... తనను తన కంటే ఎక్కువగా గౌరవించే వ్యక్తి భర్తగా లభించడం వరమని, సూర్యతో ఉన్న స్నేహాన్ని, బంధాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తానని జ్యోతిక వెల్లడించారు. సూర్య, జ్యోతిక ప్రయాణం 1999లో వచ్చిన 'పూవెల్లామ్ కేట్టుప్పార్'తో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత 'ఉయిరిలే కలందదు', 'కాక కాక' (తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన 'ఘర్షణ'), 'పేరళగన్', 'మాయావి', 'సిల్లును ఒరు కాదల్' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హీరో హీరోయిన్లుగా మొదలైన ప్రయాణం... తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెళ్ళి పీటల వరకు తీసుకు వెళ్ళారు. సెప్టెంబరు 11, 2006న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ మరుసటి ఏడాది (2007లో) కుమార్తె దియా, 2010లో కుమారుడు దేవ్ జన్మించారు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు నటనకు దూరంగా ఉన్నారు జ్యోతిక. మళ్ళీ '36 వయదినిలే'తో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Enquiry On Erravalli Farmhouse: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. KCRs Erravalli Farmhouse | హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో ఉందనే ఆరోపణలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభలో స్పష్టం చేశారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సరిహద్దులు, ఆక్రమణలపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాజీ సీఎం కేసీఆర్‌కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా విచారణ పూర్తి చేయడంలో ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులైన అధికారులు, సంబంధిత మంత్రులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ధరణి, ఉద్యమం పేరుతో ఆస్తుల కూడబెట్టుడుపై విమర్శలుతెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ భారీగా ఆస్తులను కూడబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి వివిధ ప్రాంతాల్లో సుమారు 440 ఎకరాల భూమి ఉందని, కేసీఆర్ దంపతులు, కేటీఆర్ కుటుంబసభ్యుల పేరు మీద ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయో సీఎం సర్వే నంబర్లతో సహా సభలో వెల్లడించారు. నిబంధనల ప్రకారం 27 ఎకరాలు మాత్రమే ఉండాల్సిన కేసీఆర్ దంపతులకు 67 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూమి అని తేలితే పేదలకు పంపిణీ కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో సుమారు 700 ఎకరాల వరకు విస్తరించి ఉందని, అందులో దాదాపు 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఫామ్‌హౌస్ భూమి వెనుక ఉన్న అసలు కథేంటో తేల్చాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా తేలితే, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆ భూమిని ఎర్రవెల్లి ఫాం హౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులకు, పేదలకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల హక్కులను కాపాడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం పేర్కొన్నారు.  ప్రతిపక్ష నేతలపై భూక్రమణ ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నాయకులు భూ అక్రమాలు చేశారని ఆరోపిస్తూ.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇనాం భూములను తన పేరు మీదకు మార్చుకున్నారని పేర్కొన్నారు.  రోహిన్ రెడ్డి అసైన్డ్ భూముల్లో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని.. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములతో పాటు ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ వంటి నేతలు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొల్లగొట్టారని ధ్వజమెత్తారు.   భూదాన్ భూములపై రాజకీయంపై రేవంత్ విమర్శలురాష్ట్రంలో 74 ఎకరాల భూదాన్ భూములపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో తీవ్రంగా పోరాటం చేశారని, కానీ ప్రస్తుతం ఆ భూములు అన్యాక్రాంతమైపోయాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. సీఎల్పీ నాయకుడిగా ఉన్న ఒక దళితుడికి అన్యాయం చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించారని, దోరల వద్ద బానిసలుగా ఉండాలనుకుంటే ఉండవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సొంత గ్రామంలోని ఆక్రమణకు గురైన భూములపై విచారణ జరిపించాలని ముందుగా సబితా ఇంద్రారెడ్డి కోరాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.  

Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్

రిటైర్డ్ టీచర్ సమస్యపై ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా మారువేషంలో బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లి మెరుపు తనిఖీ చేశారు. Polavaram MLA Chirri Balaraju | పోలవరం: ఏలూరు జిల్లాలో పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినూత్న రీతిలో రంగంలోకి దిగారు. ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయానికి ఒక సామాన్య పౌరుడిలా మారువేషంలో వెళ్లి అధికారులతో పాటు ప్రజలును ఆశ్చర్యపరిచారు. స్థానిక రిటైర్డ్ టీచర్ ఒకరు తన భూమికి సంబంధించిన పని కోసం ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోకపోలేదు. దాంతో విసుగు చెందిన ఆయన చివరికి కూటమి ఎమ్మెల్యేను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల తీరుపై నిశిత పరిశీలన ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న జనసేన ఎమ్మెల్యే బాలరాజు నేరుగా ఆయనే క్షేత్రస్థాయిలో సామాన్యుడిలా రంగంలోకి దిగారు. బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీసులో సుమారు గంటపాటు ప్రజల మధ్య ఉండి, అధికారుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా, సిబ్బందికి టైంకు అందుబాటులో ఉంటున్నారా అని స్వయంగా పరిశీలించారు. పంచె, టీషర్టు ధరించి.. తలపై క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి ఎమ్మార్వో  అక్కడికి వచ్చిన ప్రజలను సైతం అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. విషయం తెలిసి అధికారులు షాక్   తాను ఎవరో చెప్పి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులకు షాకిచ్చారు. అనంతరం తన రాకను వెల్లడించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిరంతరం ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. బాధితుడైన రిటైర్డ్ టీచర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని  అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీసుకున్న ఆకస్మిక తనిఖీ, అది కూడా మారువేషంలో రావడంతో  స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు

Kitchen Appliances : వంటగదిలో మనం రోజూ ఉపయోగించే పరికరాలు.. మన పనిని తగ్గించేలా ఉండాలి. అందుకే కిచెన్​లో ఈ 5 పరికరాలు ఉండేలా చూసుకోండి. ఇవి వంటను త్వరగా, ఈజీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి.  Must-Have Kitchen Appliances : కిచెన్ చిన్నగా ఉన్నా.. పెద్దగా ఉన్నా కొన్ని పరికరాలు వంటగదిలో పెట్టుకుంటే వంటను చేసుకోవడం సులభం అవుతుంది. సరైన పరికరాలను ఎంచుకోవడం ద్వారా టైమ్, ఎనర్జీని సేవ్ చేసుకోగలుగుతారు. టీ, బ్రేక్​ఫాస్ట్, కూరగాయలు కట్ చేయడం, చిరుతిళ్లు చేయడం వంటి అనేక పనులను సులభంగా చేసేలా కొన్ని పరికరాలు హెల్ప్ చేస్తాయి. ఇవి ఇంట్లో ఉండేవారికే కాదు.. పీజీలు, హాస్టళ్లు, అద్దె ఇళ్లు, స్టూడియో అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి రోజూవారీ వంటల్లో ఉపయోగపడేలా.. తక్కువ స్థలం తీసుకునే పరికరాలు ఏంటో.. అవి వంటకి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు చూసేద్దాం.  ఎగ్ బాయిలర్..  కిచెన్లో ఎగ్ బాయిలర్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టడం, మోమోలు లేదా ఇడ్లీలను స్టీమ్ చేయడం, కూరగాయలు వండటం, పిల్లల ఆహారాన్ని తయారు చేయడం వంటి పనులకు దీనిని ఉపయోగించవచ్చు. చాలావరకు మార్కెట్లలో 3-ఇన్-1 మల్టీ-కుక్కర్ ఎగ్ బాయిలర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవి 900 నుంచి.. 2,200 రేంజ్లో అందుబాటులో ఉంటాయి.  యాక్టివ్ బ్లెండర్.. మీ కిచెన్లో మిక్సర్, స్మూతీ మేకర్, ట్రావెల్ బాటిల్‌ పెట్టేందుకు స్థలం లేకపోతే.. యాక్టివ్ బ్లెండర్ తీసుకోవచ్చు. దీనిని స్మూతీలు, ప్రోటీన్ షేక్‌లు, మ్యాంగో లస్సీ, గ్రీన్ జ్యూస్, చట్నీలు, మసాలా పేస్ట్‌లు, కాఫీ పొడిని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. యాక్టివ్ బ్లెండర్ రెండు ఫుడ్-గ్రేడ్ జార్‌లు, ప్రత్యేక బ్లేడ్‌లతో వస్తుంది. వీటి ధర 1,995 నుంచి మొదలై.. 2,747 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ చాపర్.. ప్రతిరోజూ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కూరగాయలను తరగడం పెద్ద పనిగా ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ చాపర్ ఈ పనిని క్షణాల్లో పూర్తి చేయగలదు. ఎలక్ట్రిక్ వెజిటబుల్ చాపర్లో స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్, ఒక విస్కింగ్ డిస్క్, 0.4 లీటర్ల గిన్నె ఉంటాయి. ఇవి తరగడమే కాకుండా.. చట్నీ బేస్‌లను తయారు చేయడానికి, కూరగాయలను తరగడానికి, గుడ్లు లేదా క్రీమ్‌ను గిలకొట్టడానికి హెల్ప్ చేస్తాయి.  ఎలక్ట్రిక్ కెటిల్  టీ, కాఫీ, నూడుల్స్, ఇన్‌స్టంట్ సూప్ లేదా వేడి నీటి కోసం ఎలక్ట్రిక్ కెటిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్లాస్ కెటిల్‌కు 1.8-లీటర్ల సామర్థ్యం ఉంటుంది. దీనిని ఉపయోగించి మరిగించడం, ఆవిరి మీద ఉడికించడం, వండటం వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మినీ ఎయిర్ ఫ్రైయర్ మినీ ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగించి సమోసాలు, పకోడీలు, కట్‌లెట్‌లు, పనీర్ టిక్కా, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, మఖానా వంటి స్నాక్స్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్స్‌ను తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా తయారు చేసుకోవచ్చు. మినీ ఎయిర్ ఫ్రైయర్‌లో 180 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సెట్టింగ్, 30 నిమిషాల టైమర్తో హాయిగా కుక్ చేసుకోవచ్చు.  మరిన్ని పరికరాలు.. బ్రెడ్ టోస్ట్ చేయడానికి, శాండ్‌విచ్‌లను వేడి చేయడానికి, తక్కువ పరిమాణంలో కుకీలు లేదా కప్‌కేక్‌లు తయారు చేయడానికి, చీజ్ లేదా చికెన్‌ను గ్రిల్ చేయడానికి ఒక చిన్న టోస్టర్ గ్రిల్లర్ తీసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ లేకపోయినా లేదా అదనపు బర్నర్ అవసరమైనా, పోర్టబుల్ ఇండక్షన్ కుక్కర్ కూడా ఒక ప్రత్యామ్నాయం. దీనిని అన్నం, పప్పు, కూరగాయలు, తడ్కా వండటానికి మరియు పాలను వేడి చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి ఎలక్ట్రిక్ వస్తువులను కిచెన్లో పెట్టుకుంటే.. వంట వేగంగా, సులభంగా చేసుకోగలుగుతారు.  

Samson Explosive Fifty: అఫ్గాన్‌ను చిత్తు చేసి సిరీస్ కొల్లగొట్టిన భారత్, శ్రేయ‌స్ ఖాతాలో స్వదేశంలో తొలి ట్రోఫీ .. స‌త్తా చాటిన నితీశ్, అభిషేక్, ఇషాన్..

సంజూ శాంసన్ కేవలం 22 బంతుల్లోనే 57 రన్స్ చేసి దంచికొట్టడంతో భారత్ రెండో టీ20లో ఏడు వికెట్లతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి సిరీస్ గెలిచింది. India Clinch Afghanistan T20 Series Behind Samson Masterclass: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 2019 తర్వాత సొంతగడ్డపై ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్ కూడా ఓడిపోని రికార్డును భారత్ నిలబెట్టుకుంది. స్వదేశంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టుకు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9  వికెట్ల‌కు 158 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ క‌మ్ కెప్టెన్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (37) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో తెలుగు స్టార్ నితీశ్ రెడ్డి, మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అనంత‌రం టార్గెట్ ను కేవ‌లం 14.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 163 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. సంజూ శాంస‌న్ సూప‌ర్బ్ ఫిఫ్టీ (22 బంత‌ల్లో 57, 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. నితీశ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. 20 బంతుల్లోనే సంజూ హాఫ్ సెంచరీ.. విమర్శలకు బ్యాట్‌తో సమాధానంతొలి మ్యాచ్‌లో విఫలమై తీవ్రమైన ఒత్తిడిలో పడ్డ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ..  ఈ మ్యాచ్ చేజింగ్ లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా, ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్న సంజూ, మొత్తం 22 బంతుల్లోనే 57 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అవతలి ఎండ్‌లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 19 బంతుల్లో 39 పరుగులు చేసినప్పటికీ, శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 88 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి పవర్‌ప్లే ముగిసే సమయానికి స్కోరును 82 పరుగులకు చేర్చారు. 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఎంతో సులువుగా ఛేదించి విజయాన్ని నమోదు చేసింది. నితీష్ రెడ్డి కెరీర్ బెస్ట్ బౌలింగ్.. అంత‌కుముందు ఫ‌స్ట్ బ్యాటింగ్ చేపట్టిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైంది.  భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ మూడు కీలక వికెట్లు నేలకూల్చాడు. పేస్ గుర్రం అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. దీంతో అఫ్గాన్ బ్యాటర్లు భారీ భాగస్వామ్యాలు నిర్మించలేకపోయారు.   సిరీస్ కైవసం.. నామమాత్రంగా మారిన ఆఖరి పోరుమొదటి మ్యాచ్‌లో 157 పరుగులను 14 ఓవర్ల లోపే ఊదేసిన భారత బ్యాటింగ్ లైనప్, రెండో పోరులోనూ అదే విధ్వంసాన్ని కొనసాగించి విజయాన్ని తేలిక చేసింది. దీంతో మూడో టీ20 నామమాత్రపు మ్యాచ్‌గా మారింది. ఇదే వేదిక‌పై గురువారం మూడో మ్యాచ్ జ‌రుగుతుంది.  

PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

PMFME Scheme: పుడ్ బిజినెస్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా 35 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల వరకూ రుణాలు అందిస్తుంది. PMFME Scheme: కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఉన్న బిజినెస్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే.  MSME పథకం కింద ఫుడ్ బిజినెస్, కేటరింగ్ లేదా ప్రాసెసింగ్ రంగంలో ఉన్నవారికి రూ. 10 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ లభిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో ఏకంగా 35% వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఈ లోన్ పొందడానికి సరైన బిజినెస్ ప్లాన్, GST, ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. పన్నులు తగ్గించుకోవడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడటానికి ఇది ఒక గొప్ప అవకాశం.    కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో PMFME పథకం ఫుడ్ బిజినెస్ చేసేవారికి భారీ ఆర్థిక సబ్సిడీ లభిస్తోంది. కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించేవారితో పాటు, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్హతలు & సబ్సిడీ వివరాలు ప్రాజెక్ట్ ఖర్చుపై 35% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది. దరఖాస్తుదారుడు ప్రాజెక్ట్ విలువలో కేవలం 10% మాత్రమే సొంతంగా పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 90% మొత్తాన్ని బ్యాంకులు రుణంగా మంజూరు చేస్తాయి.  అర్హులు  18 ఏళ్లు పైబడిన వ్యక్తులు, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేవారు, మహిళా స్వయం సహాయక బృందాలు (SHGs), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) ఈ సబ్సిడీకి అర్హులు.  వ్యాపారాలు  బేకరీలు, పికిల్స్ తయారీ, మిల్లెట్స్ అండ్ స్నాక్స్ తయారీ, మసాలా పొడుల తయారీ, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల రసాలు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.  లోన్   మొత్తం ప్రాజెక్ట్ వ్యయం - రూ. 10,000,00 దరఖాస్తుదారు వాటా (10%) - రూ. 1,00,000 బ్యాంకు రుణం (90%) - రూ. 9,00,000 ప్రభుత్వ సబ్సిడీ (35%) - రూ. 3,50,000 కావాల్సిన పత్రాలు  ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కనీసం 8వ తరగతి పాస్ లేదా పదో తరగతి సర్టిఫికెట్  డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్  కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, షాపు రెంటల్ అగ్రిమెంట్ అప్లై చేయడం ఎలా?  PMFME పోర్టల్ https://pmfme.mofpi.gov.in/ ఓపెన్ చేయండి. మీ మొబైల్ నంబర్, ఆధార్ వివరాలతో అప్లికెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.మీ పర్సనల్ డీటైల్స్, ఫుడ్ బిజినెస్ రకం, అంచనా ప్రాజెక్ట్ ఖర్చు వివరాలను నమోదు చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ సమర్పించిన తర్వాత నోడల్ ఏజెన్సీ లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) అధికారులు పరిశీలించి, అనుమతి కోసం సంబంధిత బ్యాంకులకు పంపుతారు.

Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

Tata Sons Chairman Chandrasekaran:భారతీయ కార్పొరేషన్ దిగ్గజం టాటా సన్స్‌ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. నోయల్‌తో విభేదాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  Tata Sons Chairman Chandrasekaran Resigns:ఆగస్టు 12, 2026 ఉదయం దేశీయ వ్యాపార రంగంలో ఎవరూ ఊహించని వార్త షేర్ మార్కెట్‌ను షేక్ చేసింది సుమారు 9 ఏళ్లుగా టాటా గ్రూప్‌ను తిరుగులేని రీతిలో నడిపిస్తున్న ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన పదవీ కాలం ఫిబ్రవరి 2027 వరకు ఉన్నప్పటికీ గడువు కంటే ముందే ఆయన వైదొలగడం సంచలనంగా మారింది.  ఆగస్టు 18న జరగాల్సిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి కేవలం కొన్ని రోజుల ముందు ఈ రాజీనామా సమర్పించడం వెనుక తీవ్రమైన అంతర్గత సంక్షోభం దాగి ఉందని స్పష్టమవుతోంది. అయితే గ్రూప్‌ కార్యకలాపాల్లో ఆకస్మిక అస్థిరత రాకుండా ఉండేందుకు, తన ప్రస్తుత టర్మ్‌ ముగిసే వరకు బాధ్యతల్లో సహాయకారిగా ఉంటానని చంద్రశేఖరన్‌ బోర్డుకు తెలిజేశారు.  నోయెల్‌ టాటా కోల్డ్ వార్‌ చంద్రశేఖరన్ నిష్కృమణకు కేవం వ్యక్తిగత కారణాలు మాత్రమే కాకుండా, గ్రూప్‌లోని అత్యున్నత స్థాయి వ్యక్తుల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలే కీలకమని తెలుస్తోంది. ప్రధానంగా టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్ నోయెల్‌ టాటాతో ఆయనకు ఉన్న వ్యూహాత్మక వైరుధ్యాలు ఈ సంక్షోభానికి పునాది వేశాయి.  చంద్రశేఖరన్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టాటా న్యూ సూపర్ యాప్‌ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇ- కామర్స్‌ సెమికండక్టర్‌ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ , తక్షణ లాభాలు రాకపోవడంపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాల్సి ఉండగా, దీనిని నోయెల్ టాటా వర్గం వ్యతిరేకించింది. టాటా సన్స్‌ ఎప్పటికీ ఐపీవోకి తీసుకెళ్లకూడదనే కఠిన షరతుపై సంతకం చేయడానికి చంద్రశేఖర‌న్ నిరాకరించడం విభేదాలను మరింత ముదిరాయి.  టాటా సన్స్‌ బోర్డులో టాటా ట్రస్ట్స్‌కు ఉండాల్సిన ప్రాతినిధ్యం, నిర్వహణ అధికారుల విషయంలో ఛైర్మన్‌ చంద్రశేఖర్, ట్రస్టీల మధ్య గత కొంతకాలంగా సఖ్యత లోపించింది.  ఏజీఎం ఓటింగ్ ముప్పు ఆగస్టు 18న జరగనున్న ఏజీఎంలో చంద్రశేఖరన్‌ డైరెక్టర్‌గా తిరిగి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే 66 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్‌ ప్రతినిధులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని సంకేతాలు అందాయి. ఓటింగ్ ద్వారా పదవి నుంచి  తొలగించడం కంటే గౌరవప్రదంగా రాజీనామా చేయడమే మేలని చంద్రశేఖరన్ భావించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రశేఖర్ 9 ఏళ్లలో సాధించిన విజయాలు 2017లో సైరస్ మిస్త్రీ వివాదం తర్వాత బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్, టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన హయాంలో గ్రూప్ మార్కెట్‌ విలువ 400 బిలియన్ల మార్కును దాటింది. దశాబ్దాల తర్వాత ఎయిర్‌ ఇండియాను తిరిగి టాటా గూటికి చేర్చడం ఆయన సాధించిన అతి పెద్ద విజయం. టాటా మోటార్స్‌ను ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో లీడర్‌గా నిలపడమే కాకుండా, దేశీయ చిప్‌ తయారీకి పునాదులు వేశారు. ఐటీ రంగంలో టీసీఎస్‌ లాభాలను స్థిరంగా ఉంచుతూ గ్రూప్‌ ఆర్థిక పునాదిని బలోపేతం చేశారు.  మార్కెట్‌ ప్రభావం చంద్రశేఖరన్ రాజీనామా వార్త బయటకు రాగానే టాటా గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. టీసీఎస్‌ 2.5 శాతం, టాటా మోటార్స్‌ 3.2 శాతం, టాటా పవర్‌ 2.9శాతం మేర నష్టపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది.  తదుపరి బాధ్యతలు ఎవరికి? ప్రస్తుతం నోయెల్ టాటా పేరు రేసులో ఉన్నప్పటికీ, ఆయన నేరుగా బాధ్యతలు చేపడతారా లేదా మళ్లీ చంద్రశేఖరన్ లాంటి ఒక ప్రొఫెషనల్‌ లీడర్‌ను బయటి నుంచి ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.     

Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?

Sugar Price Hike: రక్షాబంధన్, గణేష్ చతుర్థి పండుగలు సమీపిస్తుండటంతో, చక్కెర ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం ధరలు మళ్లీ పెరగడంతో, సాధారణ కొనుగోలుదారులలో ఆందోళన నెలకొంది. Sugar Price Hike: పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ, చక్కెర ధరలు తగ్గడానికి బదులుగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం కిలో సగటు ధర 63.05 రూపాయలు ఉండగా, మంగళవారం రిటైల్ చక్కెర ధరలు దాదాపు ఒక రూపాయి పెరిగి కిలోకు సుమారు 64 రూపాయలకు చేరాయి.  ధరలు వేగంగా పెరుగుతున్నాయి వినియోగదారుల వ్యవహారాల శాఖ (ధరల పర్యవేక్షణ విభాగం) డేటా ప్రకారం, ఆగస్టు 25న అఖిల భారత చక్కెర సగటు ధర కిలోకు ₹63.97గా ఉంది. ఇది నెల రోజుల క్రితం కిలోకు ₹48.81గా ఉన్న ధర కంటే 31% అధికం. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ధర 38% ఎక్కువ. ఏడాది క్రితం ఇదే సమయంలో చక్కెర కిలోకు ₹46.31 ధరకు లభించేది.  అందుబాటులో ఉన్న డేటాను ఉటంకిస్తూ, సోమవారం చక్కెర గరిష్ట విక్రయ ధర కిలోకు ₹76 కాగా, 'మోడల్ రేటు' కిలోకు ₹65గా ఉందని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. గత కొన్ని రోజులుగా మిల్లుల వద్ద ధరలు తగ్గాయని ప్రభుత్వం, చక్కెర పరిశ్రమ సంఘాలు తెలిపాయి. అయితే, చిల్లర మార్కెట్‌పై దీని ప్రభావం ఇంకా కనిపించాల్సి ఉంది.  టోకు ధరలు తగ్గుతున్నాయి లెక్కల ప్రకారం, సోమవారం చక్కెర టోకు ధర కిలోకు ₹59.23గా ఉంది. నెల రోజుల క్రితం ఇది కిలో ₹45.35గా, ఏడాది క్రితం కిలో ₹43.01గా ఉండేది. చక్కెర దిగుమతులకు అనుమతినిస్తూ, స్పెక్యులేషన్,  నిల్వలపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల తర్వాత, చక్కెర మిల్లు ధర 18% తగ్గి కిలోకు ₹55కి చేరిందని సోమవారం ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గత వారం, చక్కెర మిల్లు ధర కిలోకు రికార్డు స్థాయిలో ₹67కి చేరుకుంది.  ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? ప్రజలకు ఉపశమనం కలిగించి, పెరుగుతున్న ధరలను అరికట్టడానికి, చక్కెర దిగుమతులపై సుంకం విధించకపోవడం సహా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో సరఫరాను పెంచేందుకు, చాలా కాలం తర్వాత 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం చక్కెర నిల్వలపై పరిమితులను కూడా విధించింది. చక్కెర డీలర్లకు 400 టన్నుల నిల్వ పరిమితిని నిర్దేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి, బేకరీలు, మిఠాయి తయారీదారుల వంటి పెద్ద పారిశ్రామిక వినియోగదారులు 15 రోజుల కంటే ఎక్కువ కాలం నిల్వలను ఉంచుకోవడానికి అనుమతి లేదు.   చక్కెర నిల్వలను, బ్లాక్ మార్కెట్‌ను నివారించేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందాలు మిల్లులను సందర్శించి, చక్కెర నిల్వలను తనిఖీ చేస్తున్నాయి.

Gold Price September 2026: సెప్టెంబర్‌లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? కీలక అంచనా!

Gold Price Prediction September 2026: బంగారం 3 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్‌లో  డాలర్, వడ్డీ రేట్లు, ప్రపంచ ఉద్రిక్తతలు, బులియన్ మార్కెట్, ప్రాపంచిక జ్యోతిష్యం గురించి తెలుసుకోండి. సెప్టెంబర్ 2026 బంగారం ధర అంచనా: బంగారం ధరలు మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కేవలం కొన్ని ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా పెరిగిన తర్వాత, బంగారం 3 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు, అతిపెద్ద ప్రశ్న సెప్టెంబర్ గురించే. ఈ పెరుగుదల ధోరణి కొనసాగుతుందా, లేక అధిక ధరల వద్ద లాభాల స్వీకరణ తిరిగి ప్రారంభమవుతుందా? మార్కెట్ పరిస్థితులు , గ్రహ సూచనలు ఈ నెలంతా తీవ్రమైన హెచ్చుతగ్గులతో ఉంటుందని సూచిస్తున్నాయి, కానీ ఏకపక్ష ర్యాలీని కాదు. ప్రస్తుతం బంగారం ఏ స్థాయిలో ఉంది? ఆగస్టు 24న అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $4,650కి చేరాయి. మే మధ్యకాలం తర్వాత ఇదే అత్యధిక స్థాయి. ఒక్క గత వారంలోనే బంగారం ధరలు ఐదు శాతానికి పైగా పెరిగాయి. దీని ప్రభావం భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. ఆగస్టు 24న, MCXలో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹163,870కి చేరుకుంది. IBJA ప్రకారం, 999 స్వచ్ఛత గల బంగారం ఉదయం ధర 10 గ్రాములకు ₹162,603గా ఉండగా, సాయంత్రం ధర ₹162,154గా ఉంది. ఇందులో జీఎస్టీ , ఆభరణాల తయారీ ఛార్జీలు కలపలేదు. అయితే, ఆగస్టు 25న అంతర్జాతీయ మార్కెట్ తన గరిష్ట స్థాయిల నుంచి స్వల్పంగా క్షీణించింది. బంగారం సుమారు 0.2 శాతం తగ్గి దాదాపు $4,640కి చేరింది. దీని అర్థం ర్యాలీ బలంగానే ఉన్నప్పటికీ, మార్కెట్ అధిక స్థాయిల వద్ద సంకోచాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఎందుకు అంతగా పెరిగింది? ఈ పెరుగుదలకు కేవలం పండుగ డిమాండ్ మాత్రమే కారణం కాదు. ప్రపంచ మార్కెట్లో డాలర్ బలహీనపడటం ఒక ప్రధాన కారణం. డాలర్ పడిపోయినప్పుడు, ఇతర కరెన్సీలలో బంగారం ధర సాపేక్షంగా తగ్గుతుంది. దీనివల్ల దాని డిమాండ్ పెరగవచ్చు. దీర్ఘకాలిక బాండ్ల కొనుగోళ్లను పెంచాలన్న అమెరికా ప్రభుత్వ ప్రణాళిక, డాలర్ , ప్రభుత్వ రుణాలపై కూడా ఆందోళనలను రేకెత్తించింది. అంతేకాకుండా, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, కొత్త ఆంక్షల అవకాశం, సురక్షిత ఆస్తిగా బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. మార్కెట్ ఇప్పుడు యూఎస్ ద్రవ్యోల్బణ డేటాను , ఫెడరల్ రిజర్వ్ వైఖరిని నిశితంగా గమనిస్తోంది. ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్లను అధికంగా ఉంచే సూచనలు ఉంటే, బంగారం లాభాలు దెబ్బతినవచ్చు. బంగారం క్రమమైన వడ్డీని అందించదు, కాబట్టి పెరుగుతున్న బాండ్ దిగుబడులు తాత్కాలికంగా దాని ఆకర్షణను తగ్గించగలవు. భారతదేశంలోని రూపాయి, డాలర్ మారకపు రేట్లు కూడా ముఖ్యమైనవి. అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, రూపాయి బలహీనపడటం దేశీయ ధరలను మరింత పెంచవచ్చు. బులియన్ నిపుణులు దేని కోసం చూస్తున్నారు? మీడియా , మార్కెట్ నివేదికల ప్రకారం, సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, అమెరికా రుణాల గురించిన ఆందోళనలు, బలహీనమైన డాలర్  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారానికి మద్దతు ఇవ్వగలవు. ధర $4,700 దాటితే, అది తదుపరి పెరుగుదలకు మార్గాన్ని తెరుస్తుందని వారు భావిస్తున్నారు. మరోవైపు, టీడీ సెక్యూరిటీస్ మరింత జాగ్రత్తగా ఉంది. వారి ప్రకారం, బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక రక్షణగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వడ్డీ రేట్లు దాని పెరుగుదలను నిలిపివేయగలవు. చాలా అధిక లక్ష్యానికి వేగంగా పెరుగుతుందని ఆశించడం తొందరపాటు అవుతుందని ఆ సంస్థ భావిస్తోంది. దీని అర్థం ఏంటంటే, ర్యాలీకి ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత గరిష్ట స్థాయి నుంచి భారీ పతనం కంటే, మొదట లాభాల స్వీకరణ జరిగి, ఆ తర్వాత కొత్త దిశ ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉంది. మేదిని జ్యోతిష్యం ఏమి సూచిస్తుంది? లౌకిక జ్యోతిష్యశాస్త్రంలో బంగారం ప్రధానంగా సూర్యుడు , బృహస్పతితో ముడిపడి ఉంటుంది. శుక్రుడు మార్కెట్ డిమాండ్, విలాసం   ఆభరణాల వ్యాపారాన్ని సూచిస్తాడు. బుధుడు వ్యాపారం , రోజువారీ మారుతున్న భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటాడు. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ జాతకంలో వృషభ రాశి లగ్నంగా ఉంది. సంపద  మార్కెట్ విలువకు ప్రాతినిధ్యం వహించే రెండవ ఇంటికి బుధుడు అధిపతి. అందువల్ల, బంగారానికి సూచిక అయిన గురుడు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. 2026 ఆగస్టు 15వ తేదీ జాతకంలో లగ్నంగా సింహరాశి ఉంది. లగ్నానికి అధిపతి సూర్యుడు, వార్షిక జాతకంలో గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇది భవిష్యత్తులో విలువైన లోహాల ధరలకు బలమైన మద్దతును సూచిస్తుంది. అయితే, సంపదకు నిలయమైన కన్యారాశిలో ఉన్న శుక్రుడు  ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 9 వరకు కొనసాగే రాహువు ముద్రా దశ, ఈ పరిస్థితిని అస్థిరంగా మారుస్తున్నాయి. రాహువు ఆకస్మిక మార్కెట్ హెచ్చుతగ్గులు, పుకార్లు, భయం, వేగవంతమైన లాభాల స్వీకరణతో ముడిపడి ఉంటుంది. అందువల్ల, సెప్టెంబర్‌లో బంగారం ధర సరళరేఖలో పెరిగే అవకాశం లేదు.  ఆగష్టు 28న జరిగిన చంద్రగ్రహణం తరువాత, సెప్టెంబర్ ప్రారంభంలో మార్కెట్ కార్యకలాపాలు అసాధారణంగా ఉండవచ్చు. మొదటి వారంలో గరిష్ట స్థాయిల నుంచి తగ్గుదల లేదా ధరలో ఆకస్మిక మార్పు సంభవించవచ్చు. నెల మధ్య నాటికి, సూర్యుని బలమైన ప్రభావం బంగారం పెరుగుదలకు మరింత కారణమైంది. సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత, మార్కెట్ దృష్టి డేటా, డాలర్ ,వడ్డీ రేట్లపైకి వేగంగా మళ్లవచ్చు. సెప్టెంబర్  పూర్తి సంకేతం   సెప్టెంబర్‌లో బంగారం ధరలలో వచ్చిన గణనీయమైన పెరుగుదల ఇంకా పూర్తిగా ముగిసినట్లు కనిపించడం లేదు. అయితే, ఆగస్టులో కనిపించినటువంటి భారీ పెరుగుదల పునరావృతం కావడం కష్టంగా ఉండవచ్చు. నెల ప్రారంభంలో , చివరిలో లాభాల స్వీకరణ ఒత్తిడి పెరగవచ్చు, అయితే మధ్యలో మళ్లీ ధరలు పుంజుకోవచ్చు. మొత్తంమ్మీద.. సెప్టెంబర్ నెల సూచిస్తున్నదేంటంటే..పెరిగిన ధరలు కొనసాగవచ్చు, కానీ ఈ క్రమంలో తీవ్రమైన తగ్గుదలలు, పునరుద్ధరణలు రెండూ ఉంటాయి. వాస్తవ దిశను అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడ్ వైఖరి, డాలర్, బాండ్ దిగుబడులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు , రూపాయి కదలికలు నిర్ణయిస్తాయి.

Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Types of Hemorrhoids : పైల్స్ సమస్యతో చాలామంది ఇబ్బంది పడతారు. అయితే దీనిలో రకాలు ఏంటో.. మొలలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. Hemorrhoids Warning Signs : పైల్స్ లేదా మొలలు (హెమరాయిడ్స్-Hemorrhoids) అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. మలబద్ధకం, మలవిసర్జన సమయంలో ఎక్కువగా ఇబ్బంది,  టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం, ఆహారంలో ఫైబర్ తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పైల్స్​లో కొన్నిరకాలు ఉంటాయి. పైగా వాటి లక్షణాలు కూడా ఒకేలా ఉండవని చెప్తున్నారు నిపుణులు.  మొలలు కొన్ని సందర్భాల్లో నొప్పి, దురద వంటి లక్షణాలు మాత్రమే కలిగి ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో మలంతో పాటు రక్తం కనిపించవచ్చు. అయితే మొలల్లో ఏ రకం ఎక్కువ ప్రమాదకరం? ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. మొలలు రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి హెమరాయిడ్స్‌. వీటిని సాధారణంగా అంతర్గత మొలలు (Internal Hemorrhoids) అంటారు. రెండు బాహ్య మొలలు (External Hemorrhoids). అంతర్గత మొలలు  మలద్వారం లోపల, పురీషనాళం దిగువ భాగంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురైనప్పుడు అంతర్గత మొలలు ఏర్పడతాయి. ఇవి ప్రారంభ దశలో తీవ్రమైన నొప్పిని కలిగించవు. కానీ మలవిసర్జన సమయంలో ఎర్రటి రక్తం కనిపించడం దీనిలో ప్రధాన లక్షణంగా ఉంటుంది. అయితే ఈ  అంతర్గత మొలలను అవి ఎంతవరకు బయటకు వస్తున్నాయనే దానిపై నాలుగు గ్రేడ్‌లుగా విభజిస్తారు. గ్రేడ్ 1 : మొలలు లోపలే ఉంటాయి. బయటకు కనిపించవు. గ్రేడ్ 2 : మలవిసర్జన సమయంలో బయటకు వచ్చినా.. తర్వాత వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. గ్రేడ్ 3 : బయటకు వచ్చిన మొలలను చేతితో మళ్లీ లోపలికి నెట్టాల్సి ఉంటుంది. గ్రేడ్ 4 : మొలలు బయటకు వచ్చి ఉంటాయి. వాటిని చేతితో కూడా లోపలికి నెట్టడం సాధ్యం కాకపోవచ్చు. బాహ్య మొలలు  మలద్వారం చుట్టూ.. చర్మం కింద ఉన్న రక్తనాళాలు వాపునకు గురైనప్పుడు బాహ్య మొలలు ఏర్పడతాయి. వీటిలో నొప్పి, వాపు, దురద, మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు బాహ్య మొలలోని రక్తనాళంలో రక్తం గడ్డకట్టవచ్చు. దీనిని థ్రాంబోస్డ్ హెమరాయిడ్ అంటారు. ఇలా జరిగినప్పుడు మలద్వారం దగ్గర గడ్డలా అనిపించడంతో పాటు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావచ్చు.అయితే థ్రాంబోస్డ్ హెమరాయిడ్ సాధారణంగా ప్రాణాంతక పరిస్థితి కాదు. కానీ తీవ్రమైన నొప్పి, వాపు లేదా గడ్డ అకస్మాత్తుగా ఏర్పడితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఏ రకం మొలలు ప్రాణాంతకం? సాధారణంగా వచ్చే అంతర్గత లేదా బాహ్య మొలలను ప్రాణాంతకమైనవిగా చెప్పలేం. కాబట్టి ఫస్ట్ గ్రేడ్ కంటే ఫోర్త్ గ్రేడ్ ప్రాణాంతకం అని చెప్పడం సరైనది కాదు. గ్రేడ్ పెరిగే కొద్దీ సమస్య తీవ్రత పెరగవచ్చు. చికిత్స అవసరం కావచ్చు. కానీ అవి స్వయంగా క్యాన్సర్‌గా మారడం లేదా ప్రాణాంతకంగా మారడం జరగదు. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..  కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఆగకుండా లేదా ఎక్కువగా మలద్వారం నుంచి రక్తస్రావం కావడం, తల తిరగడం, నీరసం లేదా బలహీనంగా అనిపించడం జరగవచ్చు. స్పృహ కోల్పోయేలా అనిపించడం, తీవ్రమైన లేదా అకస్మాత్తుగా నొప్పి పెరగడం, మలం నల్లగా లేదా తారులా కనిపిస్తే అలెర్ట్ అవ్వాలి.  మలంలో రక్తం కనిపించడం, మలవిసర్జన అలవాట్లలో మార్పులు, మలబద్ధకం, నొప్పి లేదా దురద రోజులు గడిచినా తగ్గకపోతే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. తీవ్రమైన లేదా నిరంతర రక్తస్రావం కొనసాగితే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రక్తస్రావాన్ని తేలికగా తీసుకోవద్దు.  మొలలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొలలను నివారించాలంటే మలబద్ధకాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. కాబట్టి రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి పీచు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. తగినంత నీరు తాగాలి. మలవిసర్జన వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకూడదు. టాయిలెట్‌లో అవసరానికి మించి ఎక్కువసేపు కూర్చోకూడదు. మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కకూడదు. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల కూడా మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.     గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Pensions | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువును మరో 2 రోజులు పొడిగించింది. అర్హులందరికీ అవకాశం ఇవ్వడానికే ఈ నిర్ణయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. NTR Bharosa Pensions | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువును పెంచుతూ శుభవార్త అందించింది. అర్హులైనవారు ఈ నెల 18వ తేదీ వరకు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మరో రెండు రోజులు సమయం పెంచినట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ఉన్న పింఛన్లకు దరఖాస్తు గడువును ఇప్పుడు సెప్టెంబర్ 18 వరకు విస్తరించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. స్థానిక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల వద్ద దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు రసీదు (అకనాలెడ్జ్‌మెంట్) పత్రాన్ని అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సుమారు 62 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని మంత్రి తెలిపారు. అయితే ఏదైనా కేటగిరీలో అర్హత ఉండి ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు ఈ పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు సహా ఇతర అర్హులైన చేతివృత్తుల వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.  ప్రధాన అర్హతలు ఆదాయం: గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10,000, పట్టణాల్లో రూ. 12,000 మించరాదు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే భూమి ఉండాలి. ఇతర నిబంధనలు: కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు లేదా ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు ఉండరాదు. దరఖాస్తులు, పరిశీలన విధానం అభ్యర్థులు స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయంలో అప్లికేషన్ ఫారం సమర్పించాలి. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సిబ్బంది eKYC పూర్తి చేస్తారు. ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా అర్హతలను పరిశీలించిన తర్వాత, సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డాక్యుమెంట్లు వెరిఫై చేస్తారు. ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ ఈ జాబితాను పరిశీలించి ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తారు. క్షేత్రస్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా రాష్ట్రస్థాయిలో పరిశీలన జరిపి, బడ్జెట్ కేటాయింపును బట్టి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు ఆమోదం తెలుపుతుంది.

మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?

PM Modi-Xi Meeting 2026: ఢిల్లీలో కుదిరిన ఒప్పందం తర్వాత సరిహద్దులో చైనా ఏం చేస్తుంది? చర్చలు, వాణిజ్యం, ఒత్తిడికి సంబంధించిన సంకేతాల కోసం అక్టోబర్ 2న ప్రారంభమయ్యే చైనీస్ నూతన సంవత్సర జాతకం చూద్దాం.. China Kundli 2026: షీ జిన్‌పింగ్ ...ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో  భారతదేశాన్ని ఒక భాగస్వామిగా అభివర్ణించారు కానీ ప్రత్యర్థిగా కాదు. సరిహద్దులో శాంతి, వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం గురించి కూడా చర్చించారు. వాణిజ్యాన్ని పెంచడం, ప్రత్యక్ష విమాన సర్వీసులు, వీసాలు, వ్యాపార మార్పిడులు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కానీ చైనాను అర్థం చేసుకున్నవారు కేవలం ప్రకటనలపై ఆధారపడరు. అసలు కథ దాని తదుపరి చర్యలలోనే ఉంది. చైనా అక్టోబర్ 1వ తేదీన తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కొన్ని గంటల తర్వాత, అక్టోబర్ 2వ తేదీ ఉదయం, దాని కొత్త తాజిక్ సంవత్సర జాతకం అమలులోకి వస్తుంది. దీనర్థం, ఢిల్లీ సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయానికి తొలి పరీక్ష అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.  షీ జిన్‌పింగ్ మాటలకు అనుగుణంగా చైనా సరిహద్దు విషయంలో అదే స్థాయిలో ఉదారతను ప్రదర్శిస్తుందా, లేక చర్చల ముసుగులో తన పాత ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తుందా? ప్రధాని మోదీ-షి జిన్‌పింగ్ సమావేశంలో ఏం నిర్ణయించారు? సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు. భారత్, చైనా ప్రత్యర్థులుగా కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా ముందుకు సాగాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ప్రభుత్వం ప్రకారం, సరిహద్దు వివాదానికి న్యాయమైన, సహేతుకమైన , ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా కృషి చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు వెంబడి శాంతిని కాపాడుకోవడం కూడా అత్యవసరమని నిర్ణయించారు. వాణిజ్య అసమతుల్యతలు, మార్కెట్ ప్రాప్యత, రవాణా అనుసంధానాలు , ప్రజల మధ్య రాకపోకలపై తదుపరి చర్చలు జరిగాయి. కానీ కొత్త ఉపసంహరణ ప్రణాళిక, దళాల ఉపసంహరణ తేదీ లేదా తుది సరిహద్దు ఒప్పందం ఏదీ వెలువడలేదు. ఈ అనిశ్చితి కథను అక్టోబరు వరకు తీసుకువచ్చింది. చైనా జాతీయ దినోత్సవం 1వ తేదీన, జాతకం ప్రకారం సంవత్సరపు అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందా? చైనా జాతీయ దినోత్సవం అక్టోబర్ 1న వస్తుంది. అయితే, అందుబాటులో ఉన్న జ్యోతిష్య గణనల ప్రకారం, 2026వ సంవత్సరం అక్టోబర్ 2న, బీజింగ్ స్థానిక కాలమానం ప్రకారం సుమారు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. వార్షిక జాతకం క్యాలెండర్ తేదీపై ఆధారపడి ఉండదు. అది సూర్యుడు జన్మస్థానంలో తిరిగి కనిపించే క్షణంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, జాతీయ దినోత్సవం , నూతన సంవత్సర ప్రవేశ తేదీ భిన్నంగా ఉండవచ్చు. ఈ సంవత్సరం ప్రవేశంతో ఏర్పడిన జాతకంలో లగ్నం తులారాశి. లగ్నంలో శుక్రుడు తన సొంత రాశిలో ఉన్నాడు. ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడు. అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు బుధుని ముద్రా దశ అమలులో ఉంటుంది. పైపైన చూస్తే, ఇది యుద్ధానికి సంబంధించిన జాతకంలా కాకుండా, సంప్రదింపులకు సంబంధించిన జాతకంలా కనిపిస్తుంది. చైనా అకస్మాత్తుగా ఎందుకు బలహీనంగా కనిపించవచ్చు? తులారాశి సమతుల్యత, రాజీ , భాగస్వామ్యానికి ప్రతీక. దీని అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు. బుధుడు సందేశాలు, పత్రాలు, వాణిజ్యం , దౌత్య మార్గాలకు అధిపతి. మొదటి సూచన స్పష్టంగా ఉంది. అక్టోబర్‌లో భారత్‌తో చర్చలను విరమించుకోవడానికి చైనా ఇష్టపడదు. సైనిక అధికారులు, ప్రత్యేక ప్రతినిధులు లేదా దౌత్య కార్యవర్గాల స్థాయిలో సంప్రదింపులు ముందుకు సాగవచ్చు. ప్రత్యక్ష విమానాలు, వీసాలు, వ్యాపార చలనశీలత , మార్కెట్ ప్రవేశం వంటి అంశాలపై కూడా పరిమిత పురోగతి కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. చైనా జాతకంలో, బుధ గ్రహం యొక్క షడ్కోణ బలం సాపేక్షంగా బలహీనంగా ఉండగా, శని , గురు గ్రహాల బలాలు బలంగా ఉన్నాయి. దీనివల్ల చర్చలు, ప్రకటనలు వేగంగా జరిగినా, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన వ్యూహాత్మక ఏర్పాట్లు మాత్రం నెమ్మదిగా కొనసాగవచ్చు.  సులభంగా చెప్పాలంటే, బీజింగ్ మాట్లాడటానికి తొందరపడి, వెనక్కి తగ్గడానికి నెమ్మదిగా ఉండవచ్చు. అంగారక గ్రహం ఏం చెబుతోంది? నూతన సంవత్సర జాతకంలో, విదేశాలు , బహిరంగ సంఘర్షణకు సంబంధించిన ఏడవ ఇంటికి కుజుడు అధిపతి. కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఉచ్ఛస్థితిలో ఉన్న గురుడు దానితో పాటు ఉన్నాడు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత మాత్రాన అతన్ని నిష్క్రియగా పరిగణించడం తప్పు. భూమి , భూభాగంతో సంబంధం ఉన్న చతురస్ర కోణమైన చైనా   D4లో కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు,  శని తన సొంత రాశిలో ఉన్నాడు. ఇది చైనా  ప్రాదేశిక స్థానాన్ని బలపరుస్తుంది. అందువల్ల, కొత్త జాతకంలో బలహీనపడిన కుజుడు సైన్యాన్ని బలహీనపరచడానికి బదులుగా, దూకుడు ధోరణిని మార్చగలడు. ప్రత్యక్ష ఘర్షణను నివారించాలి సరిహద్దు రహదారులు, నిఘా, సైనిక మౌలిక సదుపాయాలు , గస్తీ సామర్థ్యాలను తగ్గించకూడదు. చర్చలు కొనసాగాలి, కానీ చైనా తన మునుపటి వాదనల నుంచి వెంటనే వెనక్కి తగ్గదు. ప్రస్తుతానికి ఇది జరిగే అవకాశం కనిపించడం లేదు. కుజుడితో పాటు బృహస్పతి  ఉచ్చస్థితి, పరిస్థితి అదుపు తప్పకుండా నిరోధించగలదు. అందువల్ల, అక్టోబర్ ఒక పెద్ద యుద్ధం కంటే, నియంత్రిత ఒత్తిడి ఉండే సమయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తెర వెనుక ఇంకేమైనా జరుగుతోందా? వార్షిక జాతకంలో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ, అష్టమ భావంలో ఉన్నాడు. అష్టమ భావం అనేది వెంటనే బహిరంగపరచని నిర్ణయాలతో ముడిపడి ఉంటుంది. ఇది ఆకస్మిక మార్పులు, రహస్య చర్చలు , తెరవెనుక వ్యూహాలను కూడా సూచిస్తుంది. దీనిని ఉపయోగించి ద్రోహాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేము. అయితే, చైనా బహిరంగ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో దాని అమలుకు మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. ఇది సరిహద్దు పరిష్కారం గురించి మాట్లాడుతూనే ఉంది, కానీ తుది పటాన్ని గానీ, ప్రాదేశిక రాజీని గానీ విస్మరిస్తోంది. ఇది వాణిజ్యాన్ని పెంచుతామని వాగ్దానం చేస్తూనే, కీలక ఖనిజాలు, పారిశ్రామిక పరికరాలు లేదా సాంకేతికతపై తన నియంత్రణను కొనసాగిస్తోంది. ఈ విషయంలో భారతదేశం మాటల కన్నా చేతల వైపు చూడాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారమవుతుందా లేక నిలిచిపోతుందా? కొత్త సంవత్సర జాతకంలో పూర్తి ఇక్బాల్ యోగం లేదు. ఇందువర్ యోగం కూడా లేదు. లగ్నాధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలో బలంగా ఉన్నందున, చైనా తన దౌత్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి అనుకూలమైన స్థితిలో ఉంది. అయితే, సరిహద్దు వ్యవహారాల అధిపతి అయిన కుజుడు అనుకూలమైన స్థితిలో లేడు. సూర్యుడు, శని మధ్య ఉన్న ఉద్రిక్తత కూడా ప్రకటించిన విధానం, క్షేత్రస్థాయిలో ఉన్న అడ్డంకులు ఒకే వేగంతో ముందుకు సాగవని సూచిస్తోంది. కంబూల్ ఒప్పందం స్పష్టంగా, ఏకగ్రీవంగా ధృవీకరించబడలేదు. దీని అర్థం పరిస్థితులు పూర్తిగా తారుమారవుతాయని కాదు. ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగే సమావేశం నుంచి నేరుగా కాకుండా, ఆ తర్వాత క్రియాశీలమయ్యే యంత్రాంగాల నుంచి ఈ నిర్ణయం వెలువడుతుందనే సూచన ఉంది. ఈ కథలో తదుపరి ముఖ్య పాత్రధారులు సైనిక కమాండర్లు, సరిహద్దు నిపుణులు లేదా ప్రత్యేక ప్రతినిధులు కావచ్చు. అక్టోబర్‌లోని నాలుగు ముఖ్యమైన కాలాలు అక్టోబర్‌లో చైనాలో బుధ గ్రహ దశ ఒకేలా ఉండదు. గణన పద్ధతిని బట్టి, తేదీలు కొన్ని గంటల వరకు మారవచ్చు. అక్టోబర్ 2-9  సంభాషణలకు , నూతన దౌత్య సందేశాలకు సమయం. చైనా నుంచి సానుకూల ప్రకటనలు లేదా సంప్రదింపుల కార్యక్రమాలు వెలువడే అవకాశం ఉంది. అక్టోబర్ 9 -12 కేతువు సూక్ష్మ ప్రభావం గందరగోళాన్ని పెంచవచ్చు. సమాచారం, సమావేశాలు లేదా ప్రతిపాదనలు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. అక్టోబర్ 12 -20 శుక్ర గ్రహ ప్రభావం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారం, వీసాలు, విమానాలు లేదా ప్రజల రాకపోకలకు సంబంధించిన పురోగతికి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 20-28 దేశీయ రాజకీయాలు, ప్రతిష్టకు సంబంధించిన ఒత్తిళ్లు పెరగవచ్చు. రెండు దేశాలు తమ ప్రయోజనాలను మరింత బలంగా నొక్కిచెబుతాయి. అక్టోబర్ 28-31 అంగారకుడి సూక్ష్మ ప్రభావం జాగ్రత్త వహించమని సూచిస్తోంది. సరిహద్దు సంబంధిత వాక్చాతుర్యం, సైనిక కార్యకలాపాలు లేదా గస్తీ ఘర్షణలకు సంబంధించిన వార్తలు రావచ్చు.  అక్టోబర్ 9న భారతదేశ వ్యూహం కూడా మారనుంది భారతదేశ వార్షిక జాతకంలో, రాహువు ముద్రా దశ అక్టోబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. రాహువు ఏడవ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల విదేశీ సంబంధాలలో కార్యకలాపాలు పెరుగుతాయి, కానీ నమ్మకంపై అనిశ్చితి నెలకొని ఉంటుంది. గురు గ్రహ ముద్రా దశ అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమవుతుంది. భారతదేశ వార్షిక జాతకంలో గురు గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ, అది పన్నెండవ ఇంట్లో ఉంది. ఇది బహిరంగ ప్రదర్శన కంటే తెరవెనుక దౌత్యం, వ్యూహాత్మక సన్నాహాలు , రహస్య చర్చలను సూచిస్తుంది. భారత జాతీయ జాతకంలోని సర్వాష్టవర్గంలో, ఏడవ ఇంటికి సాపేక్షంగా తక్కువ పాయింట్లు ఉండగా, పదకొండవ ఇంటికి బలమైన పాయింట్లు ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, చైనాతో భాగస్వామ్యం అంత సులభం కాదు, కానీ కష్టతరమైన చర్చల నుంచి కొన్ని ఆచరణాత్మక ప్రయోజనాలను పొందవచ్చు. భారతదేశపు డి4లో భూమి, భద్రతకు సంబంధించిన గ్రహాలు బలంగా ఉన్నాయి. అందువల్ల, కేవలం సానుకూల ప్రకటనల ఆధారంగా సరిహద్దు సమస్యపై ప్రధాని మోదీ ప్రభుత్వం త్వరగా రాజీకి వచ్చే అవకాశం లేదు. అక్టోబర్‌లో చైనా నుంచి మనం ఏం ఆశించవచ్చు? సరిహద్దు సమస్యపై తుది పరిష్కారం లభించేలోపు, వాణిజ్యం, వీసా, విమానాలు లేదా వ్యాపార రాకపోకలకు సంబంధించిన చిన్నపాటి చర్యలు తీసుకోవచ్చు. చైనా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ సరిహద్దులోని తన వ్యూహాత్మక స్థానాన్ని అంత సులభంగా వదులుకోదు. ఒక పెద్ద దాడి జరిగినట్లు స్పష్టమైన, నిశ్చయాత్మకమైన ఆధారాలు లేనప్పటికీ, సైనిక సన్నాహాలు, సైనిక సమీకరణ, విన్యాసాలు లేదా పరిమిత గస్తీ ఘర్షణల వల్ల కలిగే ప్రమాదం గురించి ప్రస్తావించలేదు. అక్టోబర్ 2వ తేదీన చైనా వార్షిక జాతకం మారనుంది. కానీ దాని ఉద్దేశాలను కేవలం గ్రహాలు మాత్రమే నిర్ధారించవు. అక్టోబర్‌లో తీసుకునే చర్యలే అసలైన సమాధానాన్ని అందిస్తాయి. సరిహద్దు చర్చలు పురోగమించి, క్షేత్రస్థాయిలో ఒత్తిడి తగ్గుముఖం పడితే, ఢిల్లీలో కుదిరిన ఒప్పందం నిజంగా మార్గాన్ని తెరిచినట్లే. మాటలు మృదువుగా ఉండి, సైనిక మోహరింపులు, నిర్మాణ పనులు యథాతథంగా కొనసాగితే, మొదటి నెలలోనే చైనా కొత్త జాతకంలోని కఠోర సంకేతాలు బయటపడతాయి.