Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!

    1 hour ago

    Chandrababu YouTubers Meeting: సీఎం చంద్రబాబు 4.0 పాలనలో సరికొత్త పొలిటికల్ పీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. మోదీ తరహాలో సోషల్ మీడియాల్లో వైరల్ ప్రచారం చేసుకుంటున్నారు.

    TDP Digital Media Strategy:  హైటెక్ ముఖ్యమంత్రిగా, కేవలం సంస్కరణలు, గణాంకాలు మాట్లాడే విజనరీగా దశాబ్దాల పాటు ముద్ర పడిన నారా చంద్రబాబు నాయుడు తన నాల్గవ విడత పాలనలో  సరికొత్త రాజకీయ ప్రచార సరళిని పాటిస్తున్నారు. మారుతున్న డిజిటల్ కాలానికి, నేటి తరం ఓటర్ల అభిరుచులకు అనుగుణంగా తన ఇమేజ్ మేకింగ్‌ను పూర్తిగా రీ-రూట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న  డైరెక్ట్ మాస్ కనెక్ట్, డిజిటల్ పిఆర్ వ్యూహాలను చంద్రబాబు కూడా ఎంతో చాకచక్యంగా ఏపీ రాజకీయంలో అమలు చేస్తున్నారు. పాలనతో పాటు ప్రచారం, సాంకేతికతతో పాటు సామాన్య ప్రజలతో అనుసంధానం అనే ద్విముఖ వ్యూహం ఇప్పుడు అమరావతి వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

     గ్రౌండ్ లెవెల్ లో స్వయంగా రంగ ప్రవేశం 

    గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా సచివాలయం లేదా రివ్యూ మీటింగ్‌లకే పరిమితమయ్యారనే విమర్శను చెరిపేస్తూ, చంద్రబాబు ఇప్పుడు స్వయంగా ప్రజల గుమ్మాల వద్దకు వెళ్తున్నారు. నెలనెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ అందించడం, అవ్వాతాతలతో మంచాలపై కూర్చుని ముచ్చటించడం, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీధుల్లో స్వయంగా చెత్తను శుభ్రం చేయడం వంటి చర్యలు ప్రజల్లో పాజిటివ్ ముద్ర వేస్తున్నాయి. ఈ పర్యటనలకు సంబంధించిన షార్ట్స్, రీల్స్,  ఎమోషనల్ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతూ.. చంద్రబాబు ఒక మాస్ లీడర్ గా, పేదల ఆపద్బాంధవుడిగా కనిపించేలా సహాయపడుతున్నాయి.

     నాన్-పొలిటికల్ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో భేటీలు

    చంద్రబాబు 4.0 వ్యూహంలో అత్యంత ఆసక్తికరమైన అంశం.. నాన్-పొలిటికల్ డిజిటల్ క్రియేటర్లను, యూట్యూబర్లను ఆహ్వానించి మాట్లాడటం. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా ప్రాంతాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న లోకల్ కంటెంట్ క్రియేటర్లను, ట్రావెలర్లను, ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబర్లను సీఎం ప్రత్యేకంగా పిలిపించుకుని ముఖాముఖి భేటీ అవుతున్నారు. వీరి ద్వారా పొలిటికల్ కంటెంట్ కాకుండా, ప్రభుత్వ సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, పర్యాటకం వంటి అంశాలు సామాజిక మాధ్యమాల్లో ఆర్గానిక్‌గా ప్రచారం పొందుతున్నాయి. ఈ తరహా సృష్టికర్తలు రేపటి రోజున ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేయకపోయినా.. వ్యతిరేకంగా మారకుండా తటస్థంగా ఉంచడంలో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేస్తోంది.

     మోదీ స్టైల్ పిఆర్ ఫార్ములా అమలు 

    ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా అనుసరిస్తున్న పిఆర్ విధానాలను గమనిస్తే.. పారా-పోలిటికల్ లేదా నాన్-పొలిటికల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు దగ్గరవడం ప్రధానాంశం.  ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుల ద్వారా యూత్, డిజిటల్ యుగానికి దగ్గరైనట్లే, చంద్రబాబు కూడా సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారానే ప్రజల హృదయాలను వేగంగా చేరుకోవచ్చని గుర్తించారు.  గతంలో చంద్రబాబు పాలన అంటే కేవలం ఐటీ, పరిశ్రమలు, జిడిపి వృద్ధి రేట్లు మాత్రమే ఉండేవి. కానీ, ఈసారి తన  4.0  వెర్షన్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, పేదల ఆత్మాభిమానం ,  ఎమోషన్స్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.4,000 పింఛన్‌ను లబ్ధిదారుడి చేతిలో పెడుతూ వారు పడే ఆనందాన్ని కెమెరాల్లో బంధించడం, ప్రభుత్వ లబ్ధి చేకూరిన కుటుంబాలను బంగారు కుటుంబాలు గా అభివర్ణించడం ద్వారా సంక్షేమానికి ఒక మానవీయ కోణాన్ని జోడించారు. ఇది క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి పటిష్టమైన ప్రజాదరణను తెచ్చిపెడుతోంది.

     వ్యతిరేకతను అధిగమించే సమర్థవంతమైన రక్షణ కవచం 

    ఏ ప్రభుత్వానికైనా కాలక్రమేణా యాంటీ-ఇన్‌కంబెన్సీ  రావడం సహజం. అయితే, నిరంతరం ప్రజల్లో ఉంటూ, డిజిటల్ వేదికలపై ప్రత్యక్ష దృశ్యాలను విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ప్రతిపక్షాల విమర్శల తీవ్రత తగ్గుతుంది. ప్రతిపక్షాలు చేసే రాజకీయ విమర్శల కంటే, సీఎం నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి అందించే సేవలకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియా టైమ్‌లైన్లలో ఎక్కువుగా కనిపిస్తాయి. దీనివల్ల ప్రతిపక్షాల దాడిని చాలా తేలికగా తిప్పికొట్టే అవకాశం అధికార పార్టీకి దక్కుతోంది. నారా చంద్రబాబు నాయుడు తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవానికి ఆధునిక పీఆర్, డిజిటల్ మీడియా వ్యూహాలను సమర్థవంతంగా మేళవించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తన శైలిని మార్చుకోవడం ద్వారా ఆయన చంద్రబాబు 4.0  బ్రాండ్‌ను ప్రజల మనస్సుల్లో పటిష్టంగా ముద్రిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ పొలిటికల్ పిఆర్ మోడల్ ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులకు కూడా ఒక మార్గదర్శకంగా మారినా ఆశ్చర్యం లేదు.  

     
    STORIES YOU MAY LIKE
    Click here to Read More
    Previous Article
    Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment